Thursday, May 16, 2024
- Advertisement -

బెంగళూరును అమిత్ షా పిచ్చెక్కించాడు కదా

- Advertisement -

బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పరివర్తన యాత్ర.. బెంగళూరు జనాలకు 70 ఎమ్ ఎమ్ సినిమా చూపించింది. కర్ణాటకలోని అన్ని వైపుల నుంచి బెంగళూరు చేరుకున్న కొన్ని లక్షలమంది తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో బెంగళూరు సిటీ కిక్కిరిసిపోయింది. దీనికి తోడు నార్త్ కల్చర్ సిటీలో ఎక్కువ కావడంతో ఆ సపోర్ట్ కూడా దొరికేసింది. బెంగళూరు- తుమ్కూరు నేషనల్ హైవే మీదన పరివర్తన సభ దెబ్బకు వేలాది వెహికల్స్ స్తంభించి పోయాయి. వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా నగరంలోకి రావడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ ట్రాఫిక్ జాం పుణ్యమా అని బీజేపీ చీఫ్ అమిత్ షా కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ లోనే ఎక్కువసేపు ఉండిపోయారు.

చిట్ట చివరకు అమిత్ షాను ప్రత్యేక హెలికాప్టర్ లో ఇంటర్నేషనల్ జూ గ్రౌండ్ లోని బహిరంగ సభకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే విషయం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారానికి ఫస్ట్ కిక్ ఇవ్వడానికి అమిత్ షా ఈ టూర్ ను ప్లాన్ చేశారు. పేరుకు పరివర్తన యాత్రనే అయినప్పటికీ… బీజేపీ బలప్రదర్శనగా ప్రచారం మారిపోయింది. ఇంకో రకంగా చెప్పాలంటే సిద్ధరామయ్య సర్కార్ కి హార్ట్ ఎటాక్ వచ్చినంత పని చేశారు కర్ణాటక బిజిపి శ్రేణులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -