- Advertisement -
హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దుమారం రేపుతోంది. దీని వెనుక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెట్టారు. కొన్ని ఫోటోలను మీడియా ముందు పెట్టారు.
ఈ కేసులో నిందితులను పోలీసులు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. మైనర్లు కాబట్టి చూపించడం లేదని పోలీసులు కథలు చెబుతున్నారని.. కాని నిర్భయ కేసులో నిందితులు మైనర్లు అయినా మీడియా ముందుకు తీసుకువచ్చారని గుర్తు చేశారు.
నిందితులు పబ్ కు వచ్చిన కారును వదిలేసి… ఇన్నోవా కారులో వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.
Also Read