- Advertisement -
జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కేసులో బడా నేతల పిల్లలు ఉండటం వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని విమర్శించారు.
బీజేపీ నేతలు రాంచందర్రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బంగారు శ్రుతి డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. బాలిక అత్యాచార ఘటన అనేక మలుపులు తిరుగుతోందనీ.. అందుకే దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
హైదరాబాద్లో పబ్ కల్చర్తో పాటు రేప్ కల్చర్ కూడా వచ్చిందని మండిపడ్డారు. వాటిని అరికట్టి సురక్షిత హైదరాబాద్ తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.
Also Read