Saturday, April 27, 2024
- Advertisement -

ప్రకాశం జిల్లాకు ఏపీ రాజధాని….

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలక నేత, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదని.. జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలో ఉన్నట్టు ఆయన బాంబు పేల్చారు.

కాగా ఇప్పటికే ఏపీ మంత్రి బొత్సా రాజధాని మార్పుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ రచ్చ చేస్తోంది. అమరావతిని మార్చేస్తున్నారని గొగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి కలకలం చెలరేగింది.

తనకున్న సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లాకే ఏపీ రాజధాని తరలిపోతుందని జీవీఎల్ స్పష్టం చేశారు. అయితే జీవీఎల్ కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ఆయనకు ఢిల్లీలో మంచి పరిచయాలున్నాయి.. ఈ నేపథ్యంలో జగన్ సహా ఏపీ పెద్దలు బీజేపీతో చేసిన సంప్రదింపులు ఆయనకు తెలుసు. ఈ లెక్కలోనే జీవీఎల్ ఇలా వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు.

అయితే తాజాగా బొత్సతోపాటు ఏపీ మంత్రులు రాజధాని మార్పు లేదని చెబుతున్నారు. దీనిపై సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకు సైలెన్స్ ఉన్నారు. మరి ఢిల్లీ కేంద్రంగా పెద్దల అభిప్రాయం తీసుకున్నాకే చంద్రబాబు వాసనలు, క్రెడిట్ పోవడానికే రాజధానిని మారుస్తున్నారా అన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ సర్కారు మాత్రం ప్రజలకు, రాజధాని రైతులకు న్యాయం చేసేందుకే రాజధాని మార్పు నిర్ణయం తీసుకుందన్న వాదన వైసీపీలో వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -