Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీదేవిని హ‌త్య చేసిండొచ్చంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన భాజాపా సీనియ‌ర్‌నేత సుబ్రహ్యణ్యస్వామి

- Advertisement -

శ్రీదేవి మరణం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఆమె మృతికి కారణాలపై ఎన్నో ఊహాగానాలు… మరెన్నో అనుమానాలు. ముందు గుండెపోటు… తర్వాత సర్జరీల ఎఫెక్ట్‌తో చనిపోయింందని… తర్వాత ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయిందని. ఇలా పూటకో మాట వినిపించింది. ఇప్పుడు కేసు మరికొన్ని మలుపులు తిరుగుతోంది. ఇన్ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో బీజేపీ సీనియర్‌నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ..ఫోరెన్సిక్‌ రిపోర్టులో వెల్లడైన అంశాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్లు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని.. ఈ నేపథ్యంలో ఆమెతో బలంగా మద్యం సేవించారా అనేది తేలాలన్నారు. శ్రీదేవిని హత్య చేశారనే అనుమాన తనకు కలుగుతోందంటూ పెను సంచలనానికి తెర తీసారు.

ఈ మొత్తం వ్యవహారంలో సీసీ టీవీ ఫుటేజి ఏమైందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు సినీతారలతో దావూద్‌కున్న సంబంధాలపై కూడా విచారణ చేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ప్రాసిక్యూషన్‌ విషయాలను ప్రకటించే దాకా వేచి వుండాలని సుబ్రహ్యణ్యస్వామి పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -