Sunday, May 12, 2024
- Advertisement -

శ్రీదేవి మరణానికి ముందు……. బోనీ కపూర్ చెప్పిన పూర్తి వివరాలు ఇవిగో

- Advertisement -

శ్రీదేవి మరణం గురించి మన మీడియా అత్యంత దారుణంగా రిపోర్ట్ చేసింది అన్నది నిజం. ప్రజలందరూ కూడా అసహ్యించుకునేలా మన మీడియా వార్తలు వండి వార్చింది. ఆ తర్వాత కూడా అసలు విషయాలు మాత్రం పూర్తిగా చెప్పింది లేదు. అందుకే ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నింకీ ఇప్పుడు స్పష్టమైన వివరణ వచ్చింది. అది కూడా శ్రీదేవి భర్త బోనీ కపూర్ మొత్తం జరిగిన విషయాన్ని కూలంకుషంగా వివరించాడు.

ఫిబ్రవరి 24న శ్రీదేవి నుంచి బోనీ కపూర్‌కి కాల్ వచ్చింది. ‘పాపా ….ఐ యామ్ మిస్సింగ్ యూ’ అని శ్రీదేవి చెప్పింది. బోనీ కపూర్‌ని శ్రీదేవి పాపా అనే పిలుస్తుంది. బోనీ కూడా నేను నిన్ను చాలా మిస్సవుతున్నాను అని శ్రీదేవికి చెప్పాడు. అయితే ఆ రోజు సాయంత్రమే దుబాయ్‌లో శ్రీదేవిని కలవబోతున్న విషయం మాత్రం శ్రీదేవికి చెప్పలేదు బోనీ. శ్రీదేవిని ప్రేమిస్తున్నప్పుడు 1994టైంలో కూడా శ్రీదేవికి సడన్ సర్‌ప్రైజ్ విజిట్స్, గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు బోనీ. ఈ సారి కూడా అలానే చేయాలనుకున్నాడు. ఆ విషయం శ్రీదేవి కూతురు జాన్వీకి మాత్రం చెప్పాడు బోనీ కపూర్.

గత 24ఏళ్ళలో బోనీకపూర్, శ్రీదేవిలు కలిసి కాకుండా ఒంటరిగా విదేశీ ప్రయాణం చేసింది కేవలం రెండు సార్లు మాత్రమే. అయితే అప్పుడు కూడా తన ఫ్రెండ్‌ని శ్రీదేవికి తోడుగా పంపించాడు బోనీ కపూర్. అయితే శ్రీదేవి-బోనీ కపూర్‌ల వివాహం అయిన తర్వాత మొదటి సారి బోనీ కపూర్ తోడు లేకుండా ఒక విదేశంలో రెండు రోజులు ఒంటరిగా ఉన్నది. 22, 23తేదీల్లో శ్రీదేవి దుబాయ్‌లో ఉన్న ఒక హోటల్‌లో ఉంటరిగా ఉన్నది. బోనీ కపూర్‌కి లక్కోలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో తను వచ్చేశాడు. జాన్వీ కోసం షాపింగ్ చేయడం కోసం అని చెప్పి శ్రీదేవి దుబాయ్‌లోనే ఉండిపోయింది.

అయితే శ్రీదేవికి దూరంగా ఉండలేని బోనీ 24 మధ్యాహ్నం 3.30పిఎం ఫ్లైట్‌కి దుబాయ్‌కి బయల్దేరాడు. 6.20 దుబాయ్ టైంకి శ్రీ ఉన్న హోటల్‌కి చేరుకున్నాడు. హోటల్‌కి చేరుకున్నాక బోనీని చూసిన శ్రీదేవి చాలా హ్యాపీ ఫీలయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ కూడా 15నిమిషాలు మాట్లాడుకున్నారు. బోనీ, శ్రీదేవిలు రొమాంటిక్ డిన్నర్‌కి వెళ్ళాలనుకున్నారు. శ్రీ ఫ్రెష్ అప్ అయి వస్తానని బాత్రూంకి వెళ్ళింది. ఆ తర్వాత బోనీ కపూర్ ఇండియా-సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ చూస్తూ హాల్లో ఉన్నాడు. అయితే శ్రీదేవి బాత్రూం నుంచి చాలా సేపటి వరకూ బయటికి రాకపోవడం….నైట్ 8 అవుతూ ఉండడంతో ……హోటల్స్ మూసివేసే టైం అయితే డిన్నర్‌కి వెళ్ళలేం అన్న ఉద్ధేశ్యంతో హాల్లోనుంచే శ్రీదేవిని గట్టిగా పిలిచాడు బోనీ. అయితే శ్రీదేవి నుంచి సమాధానం రాలేదు. ఆ తర్వాత టీవీ వోల్యూం తగ్గించి మరోసారి పిలిచాడు. అయినప్పటికీ రెస్పాన్స్ లేకపోవడంతో శ్రీదేవి ఉన్న బాత్రూం దగ్గరకు వెళ్ళి పిలిచాడు. అయినా శ్రీదేవి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

శ్రీదేవి బాత్రూం బోల్ట్ పెట్టకుండా డోర్‌ని క్యాజువల్‌గా క్లోజ్ చేసి ఉండడంతో ……వెంటనే బోనీ డోర్ ఓపెన్ చేశాడు. లోపల దృశ్యం చూసిన బోనీ షాక్ తిన్నాడు. శ్రీదేవి బాత్ టబ్‌లో పూర్తిగా మునిగిపోయి ఉంది.

ఆ తర్వాత విషయాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే చనిపోయాక శ్రీదేవి బాత్ టబ్‌లో మునిగిపోయిందా……లేక బాత్ టబ్‌లో మునిగిపోయి చనిపోయిందా అనే విషయం మాత్రం తనకు తెలియదని బోనీ చెప్పుకొచ్చాడు. మోషన్‌లెస్‌గా మాత్రం శ్రీదేవి సివియర్ పెయిన్ అనుభవించిందని చెప్పుకొచ్చాడు. శ్రీదేవి చనిపోయిన క్షణంలోనే తన ఆశలన్నీ కృంగిపోయాయనీ, నాతో పాటు నా కూతుళ్ళ జీవితాలు కూడా తలకిందులయ్యాయని చెప్పుకొచ్చాడు బోనీ.

బోనీకి స్నేహితుడు అయిన విశ్లేషకుడు కోమల్ నహ్తాతో ఈ విషయాలన్నీ పంచుకున్నాడు బోనీ. ఇప్పటికీ అనుమానించేవాళ్ళు కొందరు ఉండొచ్చుగాక……..కానీ బోనీ కపూర్ ఇంటికి…….ఆయన కూతుర్లకు శ్రీదేవి సర్వస్వం. అలాంటి శ్రీదేవిని బోనీనే చంపేసి ఉంటాడు అని అనడం మాత్రం దారుణం. దుబాయ్ డాక్టర్స్ కూడా బోనీకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇకనైనా మన మీడియా వాళ్ళు క్రిమినల్ బ్రెయిన్స్‌తో కాకుండా మనుషుల్లా ఆలోచిస్తే బెటరేమో. లేకపోతే మనుషులందరూ మీడియాను అసహ్యించుకునే రోజులు వస్తాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -