- Advertisement -
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం రేగింది. గిల్రాయ్లోని గార్లిక్ ఫుడ్ ఫెస్ట్ వల్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. దండగులు జరిపిని కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్కు సుమారు లక్ష మంది హాజరయ్యారు.కుకింగ్, ఫుడ్ డెకరేషన్, మ్యూజిక్ ఫ్రోగ్రాంలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆదివారం రోజు ఉదయం ఈ ఫెస్ట్ ప్రారంభం కాగా, ఈ రోజు ఉదయం కాల్పులు జరిగాయి. కాల్పులతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.