బీపిన్ రావత్ అంతిమ యాత్ర ముగిసింది. ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర.. కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ స్మశాన వాటిక వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీలంక, నేపాల్, భూటాన్ సైనిక అధాకారులు హాజరై రావత్కు నివాళులు అర్పించారు.
రావత్ అంతిమయాత్రలో భారీ ఎత్తున స్థానిక ప్రజలు హజరయ్యరు. రావత్ పపార్థివ దేహంపై పూలు జల్లుతూ ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నపిల్లలు సైతం ఆయనకు నివాళులు అర్పించారు. ఓ చిన్నారి ఆర్మీ దుస్తుల్లో వచ్చి జాతీయ పతాకంతో రోడ్డుపై నిల్చొని రావత్ పార్థివ దేహం వెళ్తున్న సమయంలో సైల్యూట్ చేసింది. ఆయన ఎవ్వరో కూడా తెలియని ఆ చిన్నారి దేశ భక్తిని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.
మరోవైపు బీపిన్ రావత్ పార్థివ దేహం తీసుకు వెళ్తున్న వాహనం వెంట స్థానిక పౌరులు జాతీయ జెండాలతో వాహనంతో పాటు పరుగులు తీశారు. భారత్ మాతాకు జై అంటూ వాహనం వెనుక నుంచి స్మశాన వాటిక వరకు పౌరులు పరుగులు తీసీ దేశ భక్తిని చాటుకున్నారు.