భాజాపా..తృణముల్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో అమీత్షా మమతపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు తృణముల్ అధినేత,పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ వైపు ఎవరైనా చూస్తూ …మేము వచ్చే ఎన్నికల్లో ఢిల్లీని క్లీన్స్విప్ చేస్తామని అమీత్షాకు సవాల్ విసిరారు.తమ పార్టీని భయపెట్టాలని అనుకుంటె అది కుదరదని …అలాంటిది ఎప్పటికి జరగదని అన్నారు.భాజాపాని చూస్తే తనకేం భయం కావడం లేదని, మా పార్టీని జైలులో పెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా బెదిరించినంత మాత్రానా బెదిరిపోమని చెప్పారు. ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవడం ఖాయం అని అన్నారు.
అమీత్షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీపై విరుచుకు పడ్డారు.2019నాటి ఎన్నికల సమయానికి టీఎంసీని కూకటి వేళ్లతో పెకలించాలని బెంగాల్ బీజేపీకి ఆదేశించారు. ఆ క్రమంలోనే టీఎంసీ మొత్తాన్ని జైలులో పెట్టే రోజుంటుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ధీటుగా మమత శుక్రవారం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మీకు తెలుసు.. రానున్న రోజుల్లో టీఎంసీ ఢిల్లీని సొంతం చేసుకుంటుందని.. నన్ను ఎవరు చాలెంజ్ చేశారో వారి సవాల్ను స్వీకరిస్తున్నాను’ అని మమత చెప్పారు.
అయితే ఇప్పుడు మమత వ్యాఖ్యుల దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం కలిగించాయి. ఇంతకాలం మమత సాధారనంగా విమర్శలు చేశారు కానీ ..ఇప్పుడు ఇంత ఘాటు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఇప్పటి వరకు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా మమతతో జతకట్టడం కాయమని రాజకీయ వర్గాలు అంటున్నారు.ఇంతకాలం ఆమె ఢిల్లీ పైనా కన్నేశారని చాలామంది అనుకున్నా కూడా ఇంతకాలం డైరెక్టుగా ఆమె నోటి నుంచి ఎన్నడూ ఆ మాట రాలేదు.
Related