Monday, May 13, 2024
- Advertisement -

మినిస్టర్లకు క్లాస్‌, గల్లాజయదేవ్‌కు ప్రమోషన్ ఇచ్చిన బాబు!?

- Advertisement -

తాజాగా ఏపి సిఎం చంద్రబాబు మంత్రులకు, పార్టీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నాడట. ఎవరూ ఇంగ్లీషు ఛానల్స్‌కి ఇంటర్యూలు ఇవ్వద్దని ఆదేశించారట. దీనికి సంబందించి గల్లా జయదేవ్‌ మాత్రమే జాతీయ మీడియా ఛానల్స్‌తో మాట్లాడతారని సూచించారని సమాచారం.

ఇంకా ఎవరైతే మన పార్టీ వ్యూహాలు అన్నీ తెలిసి ఇంగ్లీషు బాగా వచ్చిన లీడర్స్ ఎవరు ఉన్నా గుర్తించాలని పార్టీ పెద్దలకు చంద్రబాబు సూచించారట.

ఈ జాగ్రత్తలన్నీ ఎందుకంటే…  మొన్న రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల ఘటనలో 30 మంది చనిపోయిన తర్వాత మునిసిపల్ మినిస్టర్ నారాయణ మరియు IT మినిస్టర్ పల్లె రఘునాథ రెడ్డి ఇద్దరూ ఈ విషయంపై జాతీయ మీడియాతో చర్చిస్తున్నపుడు, ఇంగ్లీషు మాట్లాడటంలో బాగా ఇబ్బంది పడిపోయారట. అందుకోసమే చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకొని ఎవరు జాతీయ మీడియాతో మాట్లాడాలో, ఎవరు మాట్లాడకూడదో నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకు ఇంగ్లీషు మాట్లాడటంలో గల్లా జయదేవ్ కరెక్ట్‌ అని ఈ పని ఆయనకు అప్పగించారట.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -