Sunday, May 5, 2024
- Advertisement -

జైట్లీ లాంటి దగుల్బాజీ ఆర్థిక మంత్రిని ఇప్ప‌టి వ‌ర‌కు నేను చూడ‌లేదు…

- Advertisement -

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ న‌రేంద్రంమోదీ, అర్థిక మంత్రి పై విరుచుకు ప‌డ్డారు.ఎప్పుడూ లేనంత స్థాయిలో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అరుణ్ జైట్లీలాంటి ద‌గుల్బాజీ ఆర్థిక మంత్రిని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నిక‌ల‌కోసం పెద్ద‌నోట్లు దాచుకున్నార‌ని అందుకే ఏటీఎమ్‌ల‌లో డ‌బ్బులు లేకుండా పోయాయిని జైట్లీ మాట్లాడ‌టం దారున‌మ‌న్నారు.

త‌న జీవిత కాలంలో బ్యాంకుల్లో డబ్బు లేకపోవడం ఇప్పుడే చూస్తున్నానని ఉండ‌వ‌ల్లి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చాలా దారుణమైన వ్యక్తి అని విమర్శించారు. గోద్రా అల్లర్లలో చనిపోయిన వ్యక్తుల శవాలను మొత్తం రాష్ట్రమంతా తిప్పిన ఘనత మోదీదని దుయ్యబట్టారు.

విభ‌జ‌న త‌ర్వాత ఇప్ప‌టికే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని…ఇప్పుడు కూడా పార్ల‌మెంట్‌లో దీనిపై చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోతే రాష్ట్రం మరింత నష్టపోతుందని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -