Friday, May 17, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఎంఎల్ఎ కళావతి కరోనాతో మృతి

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తుంది. ఈ కరోనా వైరస్ ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా వైరస్ కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎంఎల్ఎ కళావతి భూరియా శనివారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. ఈనెల 15వ తేదీన ఆమెకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.

దీంతో ఆమె ఇండోర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. అలీరాజ్‌పూర్ జిల్లా పరిధిలోని జాబాట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె ఎంఎల్ఎగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1990లో గ్రామ స‌ర్పంచ్‌గా రాజ‌కీయ జీవితం ప్రారంభించిన క‌ళావ‌తి భూరియా అంచెలంచెలుగా ఎదిగారు.

2018లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీచేసి ఎంఎల్ఎగా గెలుపొందారు. కళావతి మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

డ్రైవర్ గా మారిన హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్!

పీపీఈ కిట్‌ ధరించి.. మార్కెట్ లో హల్ చల్ చేసిన శృంగారతార

ప్రభాస్ పై శ్రుతి హసన్ కామెంట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -