- Advertisement -
చైనా వైఖరిని విమర్శిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ స్పందించింది. ఎక్కడో అపార్థం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధుల పర్యటనకు అనుమతించడంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వని చైనా, ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కరోనా మళ్లీ విజృంభించడంపై స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా వ్యాప్తిచెందుతోందని అన్నారు. దేశంలో మహమ్మారిని ఎదుర్కోవడంపైనే అధికారులు, నిపుణులు దృష్టి సారించారని చెప్పారు. అయినా కూడా డబ్ల్యూహెచ్ఓ బృందం పర్యటనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.డబ్ల్యూహెచ్ఓ బృందం పర్యటనకు చైనా జాప్యం చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.