- Advertisement -
తెలంగాణ లో కరోనా తగ్గినట్లే తగ్గి…. మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మంచిర్యాల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. అందులో 11మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్థినికి కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయింది.
రాష్ట్రంలో మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 35 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్కు మరొకరు బలయ్యారు. కొత్తగా 166 మంది బాధితులు కొవిడ్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి 983 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 718 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఆకట్టుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ సీత లుక్కు!