Wednesday, April 17, 2024
- Advertisement -

విండీస్-లంక మధ్య జరిగిన చివరి వన్డేకు తెనేటీగలు షాక్..!

- Advertisement -

వెస్టిండీస్​-శ్రీలంక మూడో వన్డేకు కొంతసేపు తెనేటీగలు అంతరాయం కలిగించాయి. లంక ఇన్నింగ్స్​ 38వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. విండీస్​ బౌలర్​ అండర్సన్​ ఫిలిప్​ బౌలింగ్​ చేస్తుండగా.. ఒక్కసారిగా తెనేటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు.. వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్​పై పడుకున్నారు. కాసేపటికి ఆ గుంపు.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది. తర్వాత ఆట కొనసాగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

తెనేటీగలు ఆట మధ్యలో ఇలా అంతరాయం కలిగించడం ఇదేమీ కొత్త కాదు. 2019 వరల్డ్​కప్​ సందర్భంగా సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్​లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. కాసేపటి తర్వాత ఆట మొదలైంది.ఈ వన్డేలో విండీస్​ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 274 పరుగులు చేసింది.

డి సిల్వా, బండారా అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన పొలార్డ్​ సేన 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డారెన్ బ్రేవో సెంచరీతో ఆకట్టుకోగా.. షై హోప్, కీరన్​ పొలార్డ్​ అర్థ సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్​స్వీప్​ చేసింది.

చెరుకు రసంతో మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

ఏకంగా భారత్ లో ఏడు చోట్ల సోదాలు.. ఏం దొరుకుతుంది అని ఎదురు చూపులు..!

స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ‘కోల్డ్ టీ’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -