భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న కొత్తగా 3,79,257 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 2,69,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. ఇక కరోనా కాటుకు రాజకీయ నాయకులు బలి అవుతున్నారు.. మరికొంత మంది నేతలు చికిత్స తో బయట పడుతున్నారు.
ఇప్పటికే పలు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో కోవిడ్ టెస్టు రిపోర్టు ఈరోజు వచ్చిందని… అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉంటూ పని చేస్తానని… కోవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను పాటిస్తానని తెలిపారు. అయితే అశోక్ గెహ్లాట్ భార్య సునీతా గెహ్లాట్ కు నిన్ననే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు.
షాక్.. కర్ణాటకలో 3వేల మంది కరోనా రోగులు అదృశ్యం
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా రక్కసి.. ఒక్కరోజులో 58 మంది మృతి