దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. సెకండ్ వేవ్ ప్రభావంతో రోజుకి మూడు లక్షలకు పైకా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కరోజులోనే రెండువేలకు పైగా మరణాలు సంబవిస్తున్నాయి. ఇక పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాాజాగా తెలంగాణలో కరోనా రక్కసి కాటుకు ఒక్కరోజే 58 మంది మరణించారు.
గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. 7,994 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… ఒక్కరోజులో కరోనాతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో 4,009 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. మృతుల సంఖ్య 2,208గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 76,060 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,630 మందికి కరోనా సోకింది.
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు శుభవార్త!