Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు శుభవార్త!

- Advertisement -

తెలంగాణలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 4,009 మంది కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. రోనా కష్టకాలంలో ఆదుకున్నందుకు మరోసారి సర్కార్ సిద్ధమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి ప్రజలంతా కష్టాల్లోకి వెళ్లిపోతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రైవేట్ టీచర్లకు ఉచితంగా సన్నబియ్యం, రెండు వేల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది.

ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్‌ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది. త్వరలో లాక్ డౌన్ అనౌన్స్ మెంట్ వస్తుందనన్న భయంతో ఇప్పటికే వలస దారులు తమ సొంత స్థలాలకు వెళ్లేందుక సిద్దమవుతున్నారు.

నేటి పంచాంగం, గురువారం (29-04-2021)

‘పెళ్లి సందD’ఫస్ట్ సాంగ్ రిలీజ్..

ప్రియుడి కోసం సొంత తమ్మున్ని ముక్కలుగా నరికి చంపిన సినీనటి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -