దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే ఈ మద్య కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదాల్లో కోవిడ్ పేషెంట్స్ మరణిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటుచేసుకుంది.
ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మందికిపైగా రోగులను తరలించారు.
ఈ క్రమంలో మరో ఆసుపత్రికి తరలిస్తున్న నలుగురు రోగులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముంబ్రా-కల్వా ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర అవహద్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
దుమ్మురేపుతున్న ‘టక్ జగదీష్’ టీజర్..!