Thursday, April 25, 2024
- Advertisement -

ఘట్టమనేని ఇంట బ్రిటన్ పురస్కారం..!

- Advertisement -

బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత నేషనల్​ హెల్త్​కేర్ సర్వీస్​(ఎన్​హెచ్​ఎస్)​ పార్లమెంటరీ అవార్డ్‌ను డాక్టర్‌ ఘట్టమనేని హనుమంతరావు దక్కించుకున్నారు. బాల్యంలో వచ్చే కేన్సర్‌ను నయం చేయడం సహా.. 44 ఏళ్ల నుంచి క్రిస్టీ ఆస్పత్రి వైద్యునిగా ఆయన అసమాన సేవలందించారు. ఆ విశిష్ట సేవలకు గుర్తింపుగా హనుమంతరావును నామినేట్​ చేశారు ఎంపీ జెఫ్‌ స్మిత్‌.

జాతీయ ఆరోగ్య సేవలు ప్రారంభమైన 70వ ఏట ఎన్​హెచ్​ఎస్​ పార్లమెంటరీ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఎన్​హెచ్​ఎస్​ సహా.. వ్యక్తిగతంగా పెద్దఎత్తున వైద్యసేవలు అందించిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఎన్​హెచ్​ఎస్ జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో షార్ట్‌లిస్ట్​ అయిన ఏడుగురిలో డాక్టర్‌ ఘట్టమనేని హనుమంతరావు ఒకరు.

కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన హనుమంతరావు.. కర్నూలులో వైద్య విద్య అభ్యసించారు. ఛండీగఢ్​లో రేడియోథెరఫీ విభాగంలో ఎండీ పూర్తిచేశారు. ఆ తర్వాత మాంచెస్టర్‌లోని క్రిస్టీ ఆస్పత్రిలో శిక్షణ పొందారు. ప్రఖ్యాత కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిస్టీ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తూనే.. ఎఫ్​ఆర్​సీఆర్​ పట్టా తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -