మనదేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మొదటి వేవ్ తర్వాత వ్యాక్సిన్ తీసుకొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మరోవైపు కంపెనీల దగ్గర వ్యాక్సిన్ల లభ్యత కూడా సరిపడా లేదు. దీంతో మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగింది. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ అనంతరం ప్రజల్లో వాక్సినేషన్ పై అవగాహన వచ్చింది. మరోవైపు సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో భయం ఏర్పడింది. దీంతో వ్యాక్సినేషన్ కూడా ప్రజలు ఎగబడ్డారు.
ఇదిలా ఉంటే మనదేశంలో కోవాక్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటితో పాటు మోడెర్నా, స్పుత్నిక్ వీ వంటి వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కూడా అనుమతులు వచ్చాయి. స్పుత్నిక్ వీ 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రుజువైంది. అయినప్పటికీ ఇది అందుబాటులో ఉంది. రష్యా టెక్నాలజీతో తయారైన స్పుత్నిక్ వీని మనదేశంలో రెడ్డిస్ ల్యాబ్స్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది.
ఈ వ్యాక్సిన్ ప్రజలకు ఎప్పటికి అందుబాటలలోకి వస్తుందన్న విషయంపై ఆందోళన నెలకొన్నది. ఇదిలా ఉంటే స్పుత్నిక్వీ పై తాజాగా రెడ్డిస్ ల్యాబ్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ‘స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కమర్షియల్ లాంచ్ నిలిచిపోలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది’ అంటూ రెడ్డిస్ ల్యాబ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో స్పుత్నిక్ వీపైన ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.
Also Read
థర్డ్వేవ్ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!