Monday, April 29, 2024
- Advertisement -

జ‌మ్మూ, కాశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌…ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం

- Advertisement -

పుల్వామా ఉగ్రదాడి త‌ర్వాత జ‌మ్మూ, కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత‌ను ముమ్మ‌రం చేసింది. తాజాగా గురువారం ఉదయం షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్‌, ఆర్మీ జవాన్లు కలిసి కెల్లార్‌ ఏరియాలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు.. ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ద‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తీవ్రవాదుల మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలోనూ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -