ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ నేత, దివంగత వై ఎస్సార్ బిడ్డ, సాక్షి పేపర్ యజమాని జగన్ మోహన్ రెడ్డి .. మరొకరు ఈనాడు పత్రికాధిపతి రామోజీ రావు వీరి ఇద్దరి భేటీ ఇప్పుడు పెద్ద అంశంగా మారింది.
ఆ మధ్య ఎవరిదో పెళ్ళిలో కలిసిన వీరు ఇద్దరూ ఇప్పుడు రెండవ సారి స్వయంగా జగన్ రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి మరీ రామోజీ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దీని వెనక కారణాల కోసమం అందరు తలలు పగల కొట్టుకుంటున్నారు. మన వద్దన ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బట్టీ చూస్తే ఈ భేటీ వెనక వైఎస్ భారతీ, శైలజా కిరణ్ ల స్నేహం వల్లనే జరిగింది అని తెలుస్తోంది. జగన్ – రామోజీ ఇద్దరూ ఒకరి మీద ఒకరు శత్రుత్వం వదిలి ఆరోగ్యకరమైన పోటీ ఉంటే బాగుంటుంది అని ఇలాంటి రోజు కోసం తాము ఎదురు చూస్తున్నాం అని రాయబారం పంపడం తో రామోజీ స్వయంగా ఫోన్ చేస్తే జగన్ వెళ్ళాడు అని తెలుస్తోంది.
వీళ్ళిద్దరి భేటీ విషయం లో ఎదో రాజకోట రహస్యం జరిగిపోతోంది అని అటు తెలుగు దేశం పార్టీ అభిమానులూ ఇటు వైఎస్సార్ అభిమానులూ వివిధ వాదాలు వినిపిస్తున్నారు. రామోజీ జగన్ కలవడం రెండు పార్టీల శ్రేణుల కీ ఇష్టం లేదు.