Monday, May 6, 2024
- Advertisement -

పిల్లల గొంతు కోసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉన్మాది తండ్రి..

- Advertisement -

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన తండ్రి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను గొంతుకోసి తాను కూడా ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. చిలకలూరి పేట పట్టణంలోని సుబ్బయ్యతోటకు చెందిన రమణ భార్య లక్ష్మీ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలంగా అత్తింటివారితో ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. దీనికి తోడు మద్యానికి బానిసై భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోమంగళవారం రాత్రి కూడా భార్యతొ ఘర్షణకు దిగడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీందో రోజు మాదిరే పుల్‌గా తాగొచ్చిన ర‌మ‌ణ తన ఇద్దరు కుమారుల్ని కూడా గొంతుకోసి హతమార్చాడు. అనంత‌రం తానుకూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -