దేశాన్ని వస్తు తయారీ రంగ కేంద్రంగా మార్చి ‘ఆత్మ నిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలన్న ఉద్దేశంతో పది పారిశ్రామిక రంగాలకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం కింద అయిదేళ్లలో రూ. 2 లక్షల కోట్లు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
ప్రస్తుతానికి రూ. 1.45 లక్షల కోట్ల కేటాయింపులను ప్రకటించినప్పటికీ అయిదేళ్ల నాటికి ఈ మొత్తం రూ. 2 లక్షల కోట్ల వరకు చేరవచ్చని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్లు వెల్లడించారు. కేబినెట్ సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనను దృష్టిలో ఉంచుకొని వాటికి అత్యధిక అవకాశం ఉన్న ప్రాజెక్టులకే ప్రోత్సాహకాల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. భారత్ను స్వావలంబన దేశంగా నిలబెట్టాలన్నదే ఇందులో ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు భారత్కు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు!
తప్పు చేస్తే పోలీసులను వదలం : సీఎం జగన్