- Advertisement -
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాల్లో అసక్తిపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చకుంటే …ఇప్పుడు తాజాగా కేంద్ర మాజీ ఎంపీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ జగన్ను కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా ప్రసాద్ రీజకీయాలకు దూరంగా ఉంటున్నారు. లక్ష్మీ ప్రసాద్ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడు. బుధవారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ కండువా కప్పుకున్న మరుసటి రోజె లక్ష్మీ ప్రసాద్ జగన్ను కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే ఒక పుస్తకం విషయంలో జగన్ తో మాట్లాడేందుకు మాత్రమే వచ్చానని తమ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు.