గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్యం మరింత విషమించింది. ఆమె శరీరంలో ప్లేట్లెట్లు పడిపోయాయని, రక్తం ఎక్కిస్తుంటే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, ఆమె శరీర సహకరించడంలేదని వైద్యులు తెలిపారు. వెంటనే ఆమెను హైదరాబాద్కు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గుండెపోటుతో ఇటీవల విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరిన ఆమె రక్తంలోని ప్లేట్లెట్లు ఆదివారం రాత్రికి 60 వేలకు పడిపోయాయి. హిమోగ్లోబిన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇన్ఫెక్షన్లు తలెత్తుతుండడంతో వైద్యులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
మరోవైపు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ డాక్టర్ పున్నయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.మరోవైపు సుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతిని పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.