Friday, April 19, 2024
- Advertisement -

హైదరాబాద్ లో బంగారం హవా.. ఎంత ఉందో తెలుసా..!

- Advertisement -

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా విదేశాల నుంచి తెస్తున్న బంగారాన్ని డీఆర్​ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో దాదాపు రెండున్నర కిలోల బంగారం దొరికిందని అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లుగా అధికారులను సమాచారం అందింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అధికారులు ఆ విమానాన్ని తనిఖీ చేశారు. ఓ సీటు కింద లైఫ్‌ జాకెట్‌లో దాచిన 2 కిలోల 300 గ్రాముల బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సీటులో ప్రయాణికుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

మరో ఘటనలో కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 160గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

టిఆర్ఎస్ కు ఓటేస్తే ఎవ్వరికి వేసినట్టు అవుతుందో అర్థం చేసుకోవాలంటూ ప్రశ్న..!

విశాఖ స్టీల్ ప్లాంట్ వందశాతం ప్రైవేటీకరణ తప్పదన్నకేంద్రం!

హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి!

మంత్రి పువ్వాడ ఇంటికి మెగా హీరోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -