Monday, May 13, 2024
- Advertisement -

పార్లమెంట్ గేట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఢిల్లీలో హై అలర్ట్

- Advertisement -

పార్లమెంట్ ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో.. భద్రతా సిబ్బంది అల‌ర్ట‌య్యారు. ఐతే రాంగ్ గేట్‌లోకి కారు ఎంట‌ర్ కాగానే సెన్సార్‌లు యాక్టివేట్ అయ్యాయి. వెంటనే ఇనుప చువ్వలు, బారీకేడ్ పైకి చొచ్చుకురావడంతో కారు అక్కడే ఆగిపోయింది. సెక్యూరిటీ సైరన్ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కారు నెంబర్ DL 12 CH 4897. మణిపూర్ ఎంపీ తోక్చామ్ మీన్యా (కాంగ్రెస్)కి చెందిన కారుగా పార్లమెంట్ భద్రతా సిబ్బంది గుర్తించారు. పార్లమెంట్ వెలుపల భారీగా సెక్యూరిటీ ఉంటుంది. వారిని దాటుకొని కారు ఎగ్జిట్ గేట్ వరకు ఎలా వచ్చిందన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌కాల్సి ఉంది.

కాగా, 2001 పార్లమెంట్ దాడి ఘటన ఇలాగే జరిగింది. ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి దూసుకొచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు…పార్లమెంట్‌లో బీభత్సం విష‌యం తెలిసిందే. వస్తూనే కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇప్పుడు కూడా అదే గేట్ నుంచి కారు దూసుకురావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

ప్ర‌స్తుతం పార్లమెంట్ ఆవరణలో హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఈ ఘటనతో ఎంపీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -