Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబు పిలిచినా వెళ్లం..టీడీపీ ఆఫీస్ ధ్వంసం!

- Advertisement -

ఏపీ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని విధంగా ఆ పార్టీ కార్యాలయాలను తగలబెట్టారు తెలుగు తమ్ముళ్లు. ఫైనల్ జాబితాలో టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతల మద్దతుదారులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. రోడ్డెక్కి నిరసన చేపట్టారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ గుమ్మనూర్ జయరాంకు టికెట్ కేటాయించడంపై జితేందర్ గౌడ్ వర్గీయులు బీభత్సం సృష్టించారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. టికెట్లను అమ్ముకున్న దొంగ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతపురం టీడీపీ అర్బన్ కార్యాలయం వద్ద మహిళా నేతల వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు డబ్బే ముఖ్యమైతే తమ తాళిబొట్లు అమ్ముకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలిచినా వెళ్లే ప్రసక్తేలేదని తెలిపారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.

ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పార్టీని వీటం దాదాపు ఖాయమైంది. తన తదుపరి కార్యాచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు.తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కోనేటి ఆది మూలంకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పారు. చీపురుపల్లి టికెట్‌ను కళా వెంకటరావుకి ఇవ్వడంపై కిమిడి నాగార్జున వర్గీయులు ఆందోళన చేపట్టారు. కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -