Sunday, April 28, 2024
- Advertisement -

హీరోయిన్ అవ్వాలని పూర్ణిమ సాయి ఏం చేసిందో తెలుసా..?

- Advertisement -

జూన్ 7న హైదరాబాద్ కూకట్ పల్లిలో 10వ తరగతి బాలిక పూర్ణిమ సాయి అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్ణిమ సాయి ఆచూకీ దొరకడంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలోని దాదర్ లో పూర్ణిమ సాయిని పోలీసులు గుర్తించడంతో అమ్మాయి.. ఇక్కడికి చేరింది. నిజాంపేటకు చెందిన పూర్ణిమ సాయి 40 రోజుల క్రితం అదృశ్యం అయింది.

జూన్ 7న స్కూల్ కి వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులను పిర్యాదు చేసారు. పోలీసులు స్కూల్ కు వెళ్లి విచారిస్తే.. పూర్ణిమ అసలు స్కూల్ కే రాలేదని చెప్పడంతో వారు విస్మయానికి గురి చెందారు. ఈ మిస్సింగ్ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు..14 బృందాలుగా విడిపోయి పూర్ణిమ కోసం వెతికారు. మూవీస్ లో నటించాలనే కోరిక పూర్ణిమకు ఉందని ఆమె తల్లి దండ్రులు చెప్పడంతో పోలీసులు ముంబై, చెన్నై సహా పలుచోట్ల గాలించారు. అన్ని స్టూడియోలను సంప్రదించారు. చివరకు దాదార్ లోని ఓ స్టూడియో వద్ద ఉన్న పూర్ణిమను గుర్తించిన ముంబై పోలీసులు.. ఓ ఎన్జీవోలో చేర్పించారు. పూర్ణిమ సాయి సమాచారాన్ని ముంబై పోలీసులు హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు.

అయితే.. మూడ్రోజుల క్రితమే పూర్ణిమ మిస్సింగ్ కేసును పోలీసులు కిడ్నాప్ కేసుగా మార్చారు. సినిమాల్లో నటించాలనే పిచ్చి కోరికతోనే పూర్ణియి సాయి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఓ ఎన్జీవో సంరక్షణలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మొత్తంగా పూర్ణిమ క్షేమంగా ఉందని పోలీసులు వెల్లడించడంతో ఈ మిస్సింగ్ మిస్టరీ కథ సుఖాంతం అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -