చిన్నస్వామిస్టేడియంలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. మొదటి మ్యాచ్లో ఆర్సీబీ చెన్నైచేతిలో చిత్తుగా ఓడితే…..ఢిల్లీ బ్యాట్స్మెన్ పంత్ సునామీ కారణంగా మ్యాచ్ కోల్పోయిన ముంబై టీమ్… చివరి దాకా విజయం కోసం బాగానే పోరాడింది. వైఫల్యాల తర్వాత బరిలో దిగుతున్న ఈ ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు ముంబై జట్టులోకి పేసర్ జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగలు వచ్చారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మేర్, శివం దుబే, గ్రాండ్హోమ్, నవదీప్ సైనీ, యుజువేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య, మిచెల్ మెక్లెనగన్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ, మయాంక్ మార్ఖండేయ.