Monday, April 29, 2024
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ ప్రమాణస్వీకారం

- Advertisement -

చరిత్రాత్మక రిడ్జ్ మైదానంలో బుధవారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ చేత గవర్నర్ ఆచార్య దవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు. క్యాబినెట్ మంత్రులుగా అనిల్ శర్మ, సర్వీన్ చౌదరి, రామ్‌లాల్ మార్కండా, వీరేంద్ర కన్వర్, విక్రమ్ సింగ్‌ల చేత కూడా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో రిడ్జ్ మైదానం నిండిపోయింది. హిమాచల్ ప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ప్రధాని హాజరుకావడం ఇదే ప్రథమం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 69 స్థానాలకు గాను బీజేపీ 44 సీట్లు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జైరా ఠాకూర్ ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -