- Advertisement -
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం చెన్నయ్ కార్పరేషన్ అధికారులు ఆమె పేరున వెంటనే మరణ ధృవీకరణ పత్రం జారీ చేసారు. మంగళవారం ఉదయం 11 గంటల టైం లో ఆమెకి డెత్ సర్టిఫికేట్ కార్పరేషన్ అధికారుల దగ్గర నుంచి వచ్చింది.
ఆమె తల్లి పేరు సంధ్య అనీ తండ్రి పేరు జయరాం అనీ వెల్లడిస్తూ ఆమె చిరునామాని కూడా అందులో తెలిపారు . అయితే ఆధారకార్డు సంఖ్య , డిటైల్స్ రాయాల్సిన చోట మాత్రం ఏమీ రాయకుండా వదిలేసారు అధికారులు. దాంతో ఇప్పుడు ఆమె ఆధార్ కార్డ్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. దీంతో జయలలిత అసలు ఆధార్ కార్డును తీసుకున్నారా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒకవేళ తీసుకుని ఉంటే, ఆధార్ సంఖ్య ఎంతన్న విషయం అధికారులకు తెలియదా? అన్న చర్చ జరుగుతోంది.