జియో మొబైల్ సర్వీసులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ మరో సంచలనానికి తెరలేపింది. జియో మూడో వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జియోగిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ జియో యూజర్లు ముకేశ్ అంబానీ తెలిపారు.ఇంటర్నెట్ అప్ థింగ్స్, హోంబ్రాండ్, హోం బ్రాండ్బ్యాండ్, చిన్న, మధ్యతరగతి వ్యాపారాల కోసం బ్రాడ్బ్యాండ్తో పాటు పెద్దపెద్ద వ్యాపారసంస్థల కోసం కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీసులను ప్రకటించింది.
జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా.. ఫరెవర్ ప్లాన్ తీసుకున్న వారికి 4కే రిజల్యూషన్తో కూడిన హెచ్డీ ఎల్ఈడీ టీవీలను, సెట్ టాప్ బాక్సులను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. హోంబ్రాడ్బ్యాండ్ కోసం సెటాప్ బాక్స్ తీసుకుంటే ల్యాండ్ఫోన్, అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్టైన్మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్, ఇంట్రాక్టివ్ గేమింగ్ కూడా పొందవచ్చు. రిలయెన్స్ జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి 1 జీబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ లభిస్తుంది. రిలయన్స్ గిగాఫైబర్లో 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్తో ఇంటర్నెట్ అందజేయనున్నారు. దేశంలో 2 కోట్ల మందికి గిగాఫైబర్ సేవలను అందిస్తామని అంబానీ తెలిపారు. జియో ఫైబర్ బేసిక్ స్పీడ్ 100 ఎంబీపీఎస్. జియో ఫైబర్ టారిఫ్ రూ.700 నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది