Monday, April 29, 2024
- Advertisement -

జ‌మ్మూ,క‌శ్మీర్‌లో భారీ ఎన్ కౌంట‌ర్‌…న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం…

- Advertisement -

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గింది. సైన్యానికి, ఉగ్ర‌వాదుల‌కు జ‌రిగిన కాల్పుల్లో జైషే మహమ్మద్‌ ‌(జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ ఉదయం హంజన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు సైన్యం వెల్లడించింది.

పుల్వామాలోని హంజాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారనే సమాచారం అందడంతో.. భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టి గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ఘ‌ట‌ప చోటు చేసుకుంది. సైనికుల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణించారనీ.. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సదరు అధికారి తెలిపారు.

2018లో భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 250 దాటింది. అయితే గత పదేళ్లలో పోలిస్తే ఈ ఏడాదే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. మరింత మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కి ఉంటారన్న అనుమానంతో భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -