Thursday, May 23, 2024
- Advertisement -

కన్నడీగులు ఆందోళనతో.. అంతా ఉత్కంఠ..!

- Advertisement -

కర్ణాటకలో మరాఠా అభివృద్ధి ప్రాధికార (డెవలప్​మెంట్​ కార్పొరేషన్) సంస్థ​ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో బంద్​ చేపట్టాయి కన్నడ అనుకూల సంఘాలు. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ఐక్యతకు గొడ్డలిపెట్టు లాంటిదని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలువళి, కన్నడ ఒక్కూటా వంటి సంఘాలు మండిపడ్డాయి.

బెంగళూరు టౌన్​హాల్​ వద్ద పెద్ద సంఖ్యలో కన్నడీగులు చేరి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అలాగే.. చామరాజనగర్​, బెంగళూరు రూరల్​, గదగ్​, కొప్పా, హస్సాన్​, రామనగర్​, చిత్రదుర్గా, దవాంజెర్​, బగల్కోట్​, చిక్కమగలూరు, మాండ్య సహా ఇతర జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కన్నడ ఆర్గనైజేషన్స్​లోని భాగస్వామ్య సంస్థలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం సాయంత్రం బెంగళూరులోని టౌన్​ హాల్​ నుంచి ప్రీడమ్​ పార్క్​ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి.

బంద్​ నేపథ్యంలో బెంగళూరులోని శివాజీ నగర్​లో నిర్మానుష్య దృశ్యాలు కనిపించాయి. నగరంలోని బాలగంగాధరనాథ స్వామీజీ, మగాడి రోడ్​ మెట్రో స్టేషన్లలో జనసంచారం కనిపించలేదు. హుబ్లీ నగరంలో బంద్​ ప్రభావం పాక్షికంగానే ఉంది. రోడ్లపై ప్రజారవాణా సాధారణంగానే కనిపించినప్పటికీ.. జనాల తాకిడి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -