కాంగ్రెస్ పార్టీలో ఓవెలుగు వెలిగిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి తెలియని వారుండరు.సర్వేల రారాజుగా ఆయనకు పేరు.రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి ఇప్పుడు రాజకీయంపై దృష్టిసారించారు.తెలుగుదేశంలోకి చేరతారు అని ప్రచారం ముమ్మరంగా సాగింది. కొన్ని రోజుల క్రితంసీఎం చంద్రబాబును కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
{loadmodule mod_custom,GA1}
రాజకీయాల్లో మాత్రం వేరే విధంగా చర్చజరుగుతోంది.లగడపాటి టార్గెట్ మాత్రం భారీగానే ఉందనుకుంటున్నారు.ముఖ్యంగా ఆయన టార్గెట్ టీడీపీ కాదని భాజపాలో చేరడం. ఢిల్లీలో కేంద్ర మంత్రితో నిత్యం సన్నిహితంగా వుండే తెలుగు రాజకీయ నాయకుల్లో లగడపాటి ఒకరు. ఆ విధంగా భాజపాలో చేరడానికి ఆయనకు పెద్దగా అడ్డేం లేదు.
భాజపాలో ఎవర్ని చేర్చుకోవాలన్నా పరోక్షంగా బాబు గ్రీన్ సిగ్నల్ వుండాలన్నది రాజకీయ వర్గాల్లో వినిపించే గుసగుస. చేరినా ఎక్కడో అక్కడ నుంచి పోటీ చేయాలి. అలా పోటీ చేయాలి అంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వుండకూడదు. పొత్తులో భాగంగా భాజపాకు వదిలేయాలి.అందుకే బాబును ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారని వార్త రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.
{loadmodule mod_custom,GA2}
అయితే దీనివెనుక పెద్ద కథే ఉందన్నట్లు తెలుస్తోంది.తేదేపాలోకి తీసుకోవడానికి అవకాశం లేని వారు, వాళ్లను తీసుకుంటే విమర్శలు వస్తాయనుకున్న వాళ్లను, ఎంపిక చేసిన కొద్ది మందిని భాజపాలోకి పంపి, పొత్తులో భాగంగా టికెట్ లు ఇచ్చే పథకం ఒకటి రెడీ అయిందని టాక్. అందులో భాగంగానే లగడపాటి భాజపాలోకి వెళ్తారని వినిపిస్తోంది.మరి ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}fW3OIF-VwFc{/youtube}