- Advertisement -
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో నగరవ్యాప్తంగా 9,090 కరోనా కేసులు నమోదైనట్లు బృహత్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. మరో 27 మంది మరణించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 9వ తరగతి, ఆ పై తరగతుల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మహా సర్కార్ తెలిపింది.
ఇప్పటివరకు మహారాష్ట్రంలో 29 లక్షలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచనలో ఉంది.
నన్ను ట్రోల్ చేస్తున్నారు.. ఆపండి… నాకు పవన్ తమ్ముడు ఉన్నాడు!