Saturday, April 20, 2024
- Advertisement -

నన్ను ట్రోల్ చేస్తున్నారు.. ఆపండి… నాకు పవన్ తమ్ముడు ఉన్నాడు!

- Advertisement -

ప్రతిష్టాత్మ తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున తిరుపతిలో ఇవాళ పాదయాత్ర చేసి, బహిరంగ సభలో పాల్గొన్నారు. జనసేన-బీజేపీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి, పవన్ అలక వహించారని ప్రచారం జరగడం, తిరుపతి సీటు బీజేపీ దక్కడం, అభ్యర్థి రత్నప్రభపై జనసైనికులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

‘తిరుపతిలో పవన్ కల్యాణ్ పాదయాత్ర’ ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చీఫ్ నాదెండ్ల మనోహర్‌ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ సభలో తిరుపతి అభ్యర్థి రత్నప్రభ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తే నాకు దిమ్మ తిరిగి పోయిందన్న ఆమె 40 ఏళ్ల ఐఏఎస్ సర్వీస్ లో ఎంతో అభివృద్ధి చేసానని ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తున్నారు..ఇక ఆపండి… ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ తమ్ముడు తోడుగా ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాన్ తిరుపతి ప్రచారంలో ఉద్రిక్తత!

ఛత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మృతి!

ఖుష్బూపై కేసు.. కారణం ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -