Friday, May 17, 2024
- Advertisement -

వైకాపా నుంచి మంచు లక్ష్మికి ఎమ్మెల్యే టికెట్..?

- Advertisement -
Manchu Lakshmi YSRCP MLA Ticket

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జగన్ ను ఎందుకు కలిసారు అనే వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. అయితే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మోహన్ బాబు జగన్ కు కలిసారని తెలుస్తోంది. మోహన్ బాబు కుమారుడు విష్ణు భార్య స్వయానా జగన్ కు చాలా దగ్గర బంధువు. ఆ బంధుత్వం ప్రకారం, మోహన్ బాబుకు జగన్ అల్లుడు వరుస అవుతాడు.

అందుకే జగన్ ని మోహన్ బాబు ఈ విషయమై అడిగారట. మోహన్ బాబుకు జగన్ ఎంత బంధువైనా.. చంద్రబాబునాయుడు నుంచి మోహన్ బాబు కు మంచి సంబంధాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా మంచు లక్ష్మి చంద్రబాబు కుటుంబ అభ్యులతో అత్యంత సాన్నిహిత్యంగా మెదులుతుంది. మరి అంతటి సాన్నిహిత్యాన్ని వదిలి మోహన్ బాబు ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ ను ఎందుకు కలుస్తారు..? పైగా మంచు లక్ష్మి తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ చెప్పనేలేదు.

ఒక వేల వచ్చినా ఆమెకు టీడీపీ ఉన్న అభిమానంతో అందులో చేరుతుంది కానీ, వైసీపీ లో ఎందుకు చేరుతుంది..? ఈ లెక్క ప్రకారం చూస్తే మంచు లక్ష్మి కి ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ ను మోహన్ బాబు కలిసారనే వార్తలు కేవలం పుకార్లు అని అంటున్నారు. మరో పక్క మంచు లక్ష్మి కి ఎమ్మెల్యే టికెట్ కోసం మోహన్ బాబు.. జగన్ ను అడిగారు అని కూడా అంటున్నారు. అయితే  చంద్రబాబు ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్న మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కి జగన్ టికెట్ ఎలా ఇస్తారు..? ఏది ఏమైన ఇప్పుడు జగన్.. మోహన్ బాబులకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. 

{youtube}XwmfmuwOFJI{/youtube}

Related

  1. మంచు ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది!
  2. మంచు మనోజ్ కి రాజ్‌ త‌రుణ్ కి గొడవ ఎందుకు..?
  3. మంచు ల‌క్ష్మితో గొడవకు దిగిన మంచు విష్ణు
  4. మోడీ ఎఫెక్ట్ మంచు ఫ్యామిలీపై గ‌ట్టిగానే పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -