Saturday, May 4, 2024
- Advertisement -

మాస్క్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..!

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ మాస్క్​ తయారీ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.తెల్లవారుజామున 3.50 గంటలకు తమకు సమాచారం అందినట్లు తెలిపారు అగ్నిమాపక సిబ్బంది. వెంటనే 6 అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.

పరిశ్రమలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. తలుపులు బద్దలుకొట్టి ముగ్గురిని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. అందులో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని దీన్​దయాల్​ ఉపాధ్యాయ​ ఆసుపత్రికి తరలించాం. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు జగుల్​ కిశోర్​​గా తెలిసింది అని స్థానిక అధికారులు తెలిపారు.ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరు అమన్​ అన్సారీ (18), ఫిరోజ్​ అన్సారీ (24)గా తెలిపారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -