Friday, May 17, 2024
- Advertisement -

ఉగ్రవాదులను చంపితే వీరు ఉలికిపడుతున్నారే!

- Advertisement -

వాళ్లు నిస్సందేహంగా చీడ పురుగులు. మతోన్మాదంతో వినాశనం సృష్టించిన వారు. అకారణంగా పోలీసులను పొట్టన పెట్టుకొన్న నేపథ్యం ఉన్న వాళ్లు!

వాళ్లు ఇప్పటికే దాష్టికాలు చేసేశారు. అయితే మన వ్యవస్థలో అలాంటి వారికి అంత ఈజీగా శిక్షలు పడవు. విచారణలు సాగుతున్నాయి… అలాంటి ఘాతకులు ఇప్పుడు ముప్పును కొని తెచ్చుకొన్నారు. పోలీసులు చేతిలో హతమయ్యారు.

మరి సిమి ఉగ్రవాదుల ను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అది దారుణమని అంటున్నారు.  ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఇప్పుడు ఏకంగా మూడు పార్టీల వాళ్లు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్నారు.

ముందుగా ఎంఐఎం నేత అసద్ వచ్చాడు. వికార్ అండ్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై ఆయన విరుచుకుపడ్డాడు. అన్యాయంగా చంపేశారు అంటూ వ్యాఖ్యానించాడు. చనిపోయింది ఉగ్రవాదులు కాదు.. ముస్లిం యువకులు అన్నట్టుగా ఈయన మాట్లాడాడు. 

ఆ తర్వాత కాంగ్రెస్ వాలాలు ముందుకొచ్చారు. ఈ ఉగ్రవాదులు ఫేక్ అని దిగ్విజయ్ చెప్పి వెళ్లాడు. వీటిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కూడా ఈయన డిమాండ్ చేశాడు. ఇక సాయంత్రానికి కమ్యూనిస్టు పార్టీల వారు కూడా వచ్చారు. వీరు కూడా ఉగ్రవాదులను హతం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా జరగాల్సింది కాదన్నారు! 

మరి చనిపోయింది ఏదో దేశ సేవకులు కాదు. ఉగ్రవాదులు. ఈ విషయంలో పోలీసులు తీరు ఎలా ఉన్నా.. వారు పోవడం వల్ల సమాజానికి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు కదా! ఈ రాజకీయ పార్టీల నేతలకు ఆ మాత్రం విజ్ఞత లేదా?!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -