Thursday, May 23, 2024
- Advertisement -

పవన్ మద్దతు.. టీడీపీకే.. : భూమా మౌనిక

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికల్లో.. జ‌నసేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్.. తమకే మద్దతిస్తారని భూమా నాగిరెడ్డి చిన్న‌ కూతురు.. భూమా మౌనిక అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి తమ ఫ్యామిలీకి సన్నిహితుడేన‌ని.. గతమ్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ త‌ల్లిదండ్రుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని మౌనిక మీడియా సమావేశంలో తెలిపారు.

కాగా భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో.. టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఓ వైపు నంద్యాలలో టీడీపీదే విజయమంటోంది. మరో వైపు విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విజయం తమదేనని.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికలలో తాము గెలుపు కోసమే కాకుండా.. మెజారిటీపై కూడా దృష్టి పెట్టామన్నారు. వైఎస్ జగన్ కు నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల టైంలో పను ప్రారంబించి.. దానినే.. అభివృద్ది అని చంద్రబాబు సర్కార్ చెప్పుకుంటోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -