2019 ఎన్నికల నాటికి టీడీపీలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నందమూరి,నారా కుటుంబాలు ముందే ఎక్కడ పోటీచేస్తే గెలుస్తామో సర్వేలు నిర్వహించుకుంటున్నారు.ఇక ఇప్పుడు అంతా నారోలోకేష్ గురించే.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ను దొడ్డిదారిని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి ని చేశారు.అయితే వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని నిర్నయించుకున్నారట.అందుకే బాబు సేఫ్ జోన్ వెతికి పెట్టారంట.
{loadmodule mod_custom,GA1}
తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజవర్గం. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కుప్పం నియోజకవర్గమే ప్రధాన కారణం. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచే గెలుపొందాడు. కుప్పం ప్రజలకు బాబు అంటే చాలా ఇష్టం.
అయితే ఈసారి ఆ ఛాన్సును తన కుమారుడు నారాలోకేష్ కు ఇవ్వనున్నారట బాబు. ఇప్పటికే ఒక ఆ నిర్ణయాన్ని లోకేష్ కూడా చెప్పారట బాబు. ఇక నుంచి కుప్పం నియోజవర్గంలో అభివృద్థి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్థ పెట్టాలని సూచించారట.అందుకే చిన బాబు దృస్టి సారించనున్నారు.
ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని లోకేష్ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే బాబు ఈ నిర్ణయం తీసేసుకున్నారట. కుప్పంలో అయితే నారా లోకేష్ విజయం సులువు అవుతుందని బాబు ఆలోచన. నారా కుటుంబంలో ఎవరైనా సరే ఆదరించేందుకు కుప్పం ప్రజలకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
నారా లేకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలంటె కుప్పం తప్ప మరో చోట అయితే కష్టం.అందుకే ఆయన్ను కుప్పంనుంచి పోటీ చేసేందుకు రెడి అవుతన్నారంట.మరి బాబు ఎక్కడనుంచి పోటీ చేస్తారనేదానిపై అయితే ఇప్పటి వరకు క్లారిటీలేదు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- చంద్రబాబు ఆవిధంగా ముందుకెల్తున్నారు….!
- టీడీపీనుంచి కాదుకాదు….తెలుగు ప్రజలనుంచి పివి ప్రధాని
- దెబ్బకు మామ, అల్లుడు కృష్ణాజిల్లాకు ప్యాక్అప్..?
- లోకేష్పై రోజా సినిమా డైలాగ్ పంచ్ అదిరింది
{youtube}TMwDNIMJj-0{/youtube}