ఇప్పుడు ఎవరి నోట విన్న ఒకటే మాట వినిపిస్తోంది వామ్మో మోడీ ఎలా వాయించేస్తున్నారేంటి? ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న నోట్ల రద్దుపైనే చర్చ. అయిన ప్రధాని మోడీ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దేశ ప్రజలారా! మీరు కాస్త ఓపిక పట్టండి. ఇది కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయంటూ భరోసా ఇస్తున్నారు.
అసలు మోడీ మదిలో ఉన్న నిఖార్సయిన ఆలోచన ఏంటి.. దేశ ఆర్థిక వ్యవస్థ ను పూర్తిగా గాడిలో పెట్టడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుండని మోడీ నమ్ముతున్నారు. దేశంలో అన్ని వ్యాపారలకు సంబంధించిన లావాదేవీలు ఆన్ లైన్లో, పారదర్శ కంగా… మనీ అంతా వైట్ లో నడవాలనేది ఆయన అభిమతం. ఇలా అంతా సరిగ్గా జరిగితే, దేశ వ్యాప్తణ్గా ఒకే రకమైన పన్నుల విధానాన్ని ప్రవేశ పెట్టు.. ఎక్కడ ఏ వస్తువు కొన్నా.. ఒకేరకంగా పన్నులు రాబట్టి సర్కారు ఖజానాను అభివృద్ధి చేయాలి. దేశ ప్రగతికి ఆ ధనం ఉపయోగపడాలి. ఇలా అనుకున్నట్లు అంతా సాగితే, కొంచెం ఆలస్యం అయిన ఒక పెను నిర్ణయం తీసుకోవాలని ప్రధాని ఆలోచిస్తున్నారట. అదేదో కాదు…
దేశంలో చాలామంది పెద్దలు నుంచి మొదలుకొని చిరు వ్యాపారుల వరకు అందరూ సతమతం అయ్యేది ఇన్ కంట్యాక్స్ గురించే. అవును… దేశంలో విప్ల వాత్మ కంగా ఐ.టి.ని రద్దు చేసి, సంచలనం సృష్టించాలని మోదీ సంకల్పమట. దీని ద్వారా తన ఆర్థిక సంస్కరణలకు ముగింపు పలకాలని మోదీ భావిస్తున్నారని సమచారం. అన్ని వినిమయ వస్తువులకు పన్నులు సరిగా కడితే, ఇక ఆదాయ పన్నుతో పనేముందనేది విప్లవాత్మక కాన్సెప్ట్. వచ్చే ఎన్నికల నాటికి ఈ కాన్సెప్ట్ని అమలు చేస్తే… దేశంలోని బడా బాబుల నుంచి, చిరు వ్యాపారులు, వేతన జీవులు కూడా హ్యాపీగా ఫీలవుతారు. మోదీకి జై అంటూ మరోసారి విజయం అందిస్తారనే ఆలోచలో ఉన్నారట.
Related