అతని ఓ కిళ్ళీ కొట్టు ఉంది. ఆ కొట్టుకి అతనే యజమాని… అయితే ఖాతాల్లోకి ఏకంగా రూ. కోట్లు జమ అయ్యాయి. దాంతో అతడి అకౌంట్ బ్లా అయ్యింది. పూర్తి వివరాల్లో వెళ్తే… పప్పు కుమార్ తివారీ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. అయితే ఇతను రూ. 1000 విత్ డ్రా చేసేందుకు ఏటిఎం కు వెళ్ళాడు.
డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా అతని అకౌంట్ బ్లాక్ అయినట్టు తెలిసి షాక్ కు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం తెలిసి నిర్ఘాంత పోవడం అతని వంతయింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఒక్కసారిగా పప్పు కుమార్ తివారీ బ్యాంకు ఖాతాలోకి రూ. 9 కోట్ల 99 లక్షల 95 వేల 498 లు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు సైబర్ టీం గుర్తించింది. నిజానికి అతని అకౌంట్ లో రూ 4580 మాత్రమే ఉండాల్సింది.
దీంతో అనుమానాస్పద లావాదేవీగా భావించి అతడి బ్యాంక్ అకౌంట్ ను స్థంభింపజేశారు. అయితే తాను సాధారణ వ్యక్తినని తన ఖాతాలో లక్షన్నరకు మించి ఎప్పుడు జమ చేయలేదని తివారీ బ్యాంకు అధికారులకు తెలిపాడు. దీంతో అతడి ఖాతాలో జమ అయిన పది కోట్ల ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పై దర్యాప్తు జరుపుతున్నారు.
Related