సమాజంలో రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరుగుతున్న హత్యలు,అత్యాచారాలను ఆపలేక పోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్లో సభ్య సమాజం తల దించుకొనే సంఘటన చోటు చేసుకుంది.తెల్లారితే పెల్లిపీటలెక్కాల్సిన నవ వధువు జీవితం కామాంధులు అమె జీవితాన్ని నాశనం చేశారు.
వివిరాల్లోకి వెల్తే పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన ఒక పద్దెనిమిదేళ్ల యువతికి నిన్న ఉదయం వివాహ ముహూర్తం నిశ్చయించారు.ఆ ఇల్లంతా బంధుమిత్రుల సందడితో కళకళలాడుతోంది. ఎవరికి వారు పెళ్లి ఏర్పాట్లలో
నిమగ్నమయ్యారు.కాని ఇంతలోనే అనుకోనే సంఘటన జరిగింది.అయితే ఆదివారం రాత్రి ఆమె గ్రామం బయటకు బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు కొందరు స్నేహితులతో కలిసి ఆమె నోరు మూసి దగ్గర్లోని చెరుకుతోటలోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోని ఆమెను పొలాల్లో వదిలివెళ్లారు కీచకులు.
{loadmodule mod_custom,Side Ad 1}
యువతి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు కలసి వెతికారు. ఆఖరికి సోమవారం సాయంత్రం గ్రామానికి దగ్గర్లోని చెరకు తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పశువుల కాపరులు గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. పెళ్లి జరగాల్సిన రోజు కూతురు అఘాయిత్యానికి బలికావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన భరితులయ్యారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
Also read