Tuesday, May 7, 2024
- Advertisement -

తెలంగాణలో కరోనా ఉద్రిక్తత.. నలుగురు మృతి!

- Advertisement -

తెలంగాణ లో రోజు రోజుకీ కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 4,678కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 463 మంది మహమ్మారి బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,205కి చేరింది. తాజాగా 364 మంది కోలుకోగా… ఇప్పటి వరకు 300,833 మంది కోలుకున్నారు.

మరో నలుగురిని మహమ్మారి బలితీసుకోగా… మొత్తం మరణాలు 1694కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,678 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,723మంది ఐసోలేషన్​లో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న42,461 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.

ఇక కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

స్వల్పంగా తగ్గిన పసిడి.. నిలకడగా వెండి ధరలు!

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -