Tuesday, May 21, 2024
- Advertisement -

శ్మీర్‌లోని ఉగ్ర‌వాదుల భ‌ర‌తం ప‌ట్ట‌డానికి రంగంలోకి ఎన్ఎస్జీ కమెండోలు..

- Advertisement -

కశ్మీర్ లో ఉగ్రవాదుల పీచమణిచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్ర‌మూక‌ల‌ను స‌మూలంగా తుడిచి పెట్టేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (బ్లాక్ క్యాట్ కమెండోలు)ను రంగంలోకి దించేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ప్రత్యేక శిక్షణ పొందిన కమెండోలు సరిహద్దుల్లో మోహరించనున్నారు.

స‌రిహ‌ద్దుల‌తో పాటు శ్రీనగర్‌లో భద్రత కోసం కూడా బ్లాక్ క్యాట్ కమెండోలను వినియోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గూబా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియాలకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీచేశారు. జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలకు జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్రవాద నిరోధక కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వాలని ఎన్ఎస్జీ కోరింది.

దీంతో జమ్మూ కశ్మీర్ డీజీపీని కలవడానికి ఓ ఉన్నతాధికారితో కూడిన ప్రత్యేక బృందాన్ని పంపిన ఎన్ఎస్జీ చీఫ్, ఉగ్రవాద పోరాటానికి అవసరమైన సిబ్బంది గురించి తెలుసుకున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహించే బ్లాక్ క్యాట్ కమెండోలకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది.

కశ్మీర్ నుంచి ఉగ్రభూతాన్ని సమూలంగా తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్జీ విభాగంలో పదివేల మంది గార్డులు ఉన్నారు. మెరుపుదాడులు చేయడంలో వీరు సిద్ధహస్తులు. ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల భద్రత కోసం వీరిని వినియోగిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -